రాజన్న సిరిసిల్ల: వేములవాడలో కొలువై ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆలయంలో శీఘ్ర దర్శనం అమలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఇవాళ సోమవారం కావడం.. ముందు రెండు రోజులు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.