హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసులో అశోక్కు హైకోర్టులో చుక్కెదురైంది. నోటీసులకు సమాధానం ఇచ్చేలా.. ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ కోరారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్ను హైకోర్టు ఆదేశించింది. ఐతే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని అశోక్ తరఫు న్యాయవాది కోరారు. అశోక్ తరఫు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఐటీగ్రిడ్స్పై విచారణ కొనసాగించాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.