టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దని టీఆర్ఎస్ దుర్మార్గం చేస్తోందన్నారు. చట్టసభల కార్యకలాపాల్ని కూడా బజారుకీడ్చారన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వ్యవహార శైలిపై అన్ని పార్టీలకు లేఖలు రాస్తామన్నారు.