ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమ్మకద్రోహం చేయాల్సిన అవసరం నాకు లేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 03:13 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో దళిత నేతలకు గౌరవం లేదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో లింగయ్య మాట్లాడుతూ.. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తే 10వేల మందితో సభ పెట్టలేకపోయారు. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటాను. నమ్మకద్రోహం చేయాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడమే సరైంది. జిల్లా అభివృద్ధికి కేటీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి సహకారం ఉంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కే ప్రజల్లో ఆదరణ ఉందని లింగయ్య పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com