హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ తేదీలు రంజాన్ మాసంలో వచ్చాయని, ఆ మాసంలో ముస్లింల ఓట్ల శాతం పెరుగుతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ సమయంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై చెలరేగిన వివాదంపై ఒవైసీ స్పందించారు. ఈ వివాదం అర్థరహితమైనదని, అనసవరమైనదని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీలను, రంజాన్ను ఏ కారణంగానైనా ఉపయోగించుకోవద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రంజాన్లో ముస్లింలు ఉపవాసం ఉంటారని, సాధారణ జీవితాన్ని గడుపుతారని, ఆఫీస్లకు వెళతారని ఒవైసి చెప్పారు. లౌకిక వ్యవహారాల నుంచి దూరంగా ఉంటారు కనుక ఓటింగ్ శాతం బాగా పెరగడానికి ఆస్కారం ఉందని ఆయన చెప్పారు.