సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీన కరీంనగర్, 19వ తేదీన నిజామాబాద్ లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ రెండు సభలలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కరీంనగర్ లో 17న జరిగే సభలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రతి సభకు కనీసం 2 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఆయన పార్టీ శ్రేణులను సూచించారు. ఎంపీ లను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలే తీసుకోవాలని కేసీఆర్ కోరారు.