నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తరుణ్.. పరీక్షల్లో తప్పుతానేమోననే భయంతో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. తరుణ్ ప్రగతి కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.