జిల్లాలోని సుజాత నగర్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి రెండు కాళ్ళు విరిగాయి. మృతులను సింగభూపాలెం గ్రామానికి చెందిన ఇల్లంగి లాజర్(25), కోడిరెక్కల రాజు(20)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.