హాంకాంగ్: ఫిషింగ్ బోటు, ఆయిల్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. హాంకాంగ్లోని లమ్మా ఐలాండ్లో ఈ ఘటన జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ధాటికి చేపల వేటకు వెళ్లిన నౌక ముంపునకు గురైంది. అయితే ఆయిల్ ట్యాంకర్పై ఉన్న 13 మంది సురక్షితంగా ఉన్నారు. ఫిషింగ్ బోటులో ఉన్నవారు ఎవరైనా గల్లంతయ్యారా అనేది ఇంకా తెలియాల్సి ఉందని, రెస్యూ టీం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గత జనవరిలో హాంకాంగ్లోనే ఆయిల్ట్యాంకర్లో మంటలు చెలరేగిన ఘటనలో...ఓ వ్యక్తి మృతి చెందగా..ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే.