రంగారెడ్డి : చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాకు జరిగిన అన్యాయంపై.. వికారాబాద్లో చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగం చేసి విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని నష్టం వాటిల్లిందని, గత అయిదేళ్లలో జిల్లాకు ఒక్క కొత్త ఉద్యోగం రాలేదని, ఒక్క ఎకరానికి నీరు కాని రాలేదని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.