శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మంచు తుపాన్లో చిక్కుకుని ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. కొంతమంది ఒక బృందంగా కుప్వారానుంచి కాలినడకన కర్నాత్ వెళుతున్న సమయంలో వారు మంచు తుపాన్లో చిక్కుకున్నారని పోలీసులు చెప్పారు. సాధ్నా పర్వత శ్రేణి శిఖరం వద్ద ఖోని నల్లా ప్రాంతంలో మంచు తుపాన్లో చిక్కుకున్న వారిలో ముగ్గురు జాడ తెలియకుండా పోయారని, మిగిలిన వారు శిఖరాగ్రానికి చేరుకోగలిగారని పోలీసులు చెప్పారు. భద్రతా దళాలు నేడు చేపట్టిన గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు.