కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక వేత్త నామ్దేవ్ త్యాగిని రివర్ ట్రస్టు ఛైర్మన్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మా నర్మద, మా క్షిప్రా, మా మందాకిని రివర్స్ ట్రస్టు ఛైర్మన్గా నామ్దేవ్ త్యాగిని నియమించినట్లు రాష్ట్ర ఆధ్మాత్మిక విభాగం ఆదేశాలు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడానికి కొద్ది సమయం ముందు త్యాగిని నియమించినట్లు ఒక అధికారి తెలిపారు. గత ఏడాది బిజెపి నేతృత్వంలోని గత ప్రభుత్వం కంప్యూటర్ బాబాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. అయితే నర్మదా నదిలోనుంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో నాటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విఫలమయ్యారని ఆరోపిస్తూ త్యాగి తన పదవికి రాజీనామా చేశారు.