తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో చర్చించామని మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీలు గెలిస్తే టీఆర్ఎస్కు లాభం లేదని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తేనే తెలంగాణకు మరింత ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఓటేయాలని కిషన్రెడ్డి పిలుపిచ్చారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కల్వకుంట్ల కుటుంబానికి గులాంగిరి చేయాల్సిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్కు బీ టీమ్గా మారిందని విమర్శించారు. తన పోటీపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయమని కిషన్రెడ్డి స్సష్టం చేశారు.