ఢిల్లీ : ఢిల్లిలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి కలిశారు. కపిల్ సిబల్, సయ్యద్ సుజ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర హోంమంత్రిని విజ్ఞప్తి చేశారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కపిల్ సిబల్, సయ్యద్ సుజ లు ఆరోపణలు చేసినందున చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ కపిల్ సిబల్పై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈసీ సైతం ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలన్నారు.