రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డిని మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సమస్యలపై మంత్రి కి విన్నవించారు. నూతన మున్సిపాలిటీలలో, నూతన మండల కేంద్రాలలో శాఖా గ్రంథాలయల ఏర్పాటు, గ్రామ పంచాయతీలలో పుస్తక నిక్షిప్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.