హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణలోని అభివృద్ధిని దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే ప్రధాని మోదీ కూడా కాపీ కొట్టారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ను గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు.
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా 80 శాతం టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారన్నారు. జహీరాబాద్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అగ్రగామిగా ఎదిగిందన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. జహీరాబాద్లో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు.