ములుగు జిల్లాలో వాజేడు మండల కేంద్రంలోని జగన్నాథపురం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రతుకు దెరువు కోసం ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు.