హైదరాబాద్: సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్రెడ్డి భేటీ కానున్నారు. వీరితో పాటుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కేసీఆర్ను కలుస్తారు. ఈ సమావేశంలో సబితా, కార్తీక్రెడ్డి టీఆర్ఎస్లో చేరడంపై చర్చించే అవకాశం ఉంది. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైంది. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నారన్న సమచారంతో కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఆమెను బుబ్బగించే ప్రయత్నం చేశారు. రేవంత్ రాయబారం నడిపినప్పటికీ కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రేవంత్రెడ్డితో సబితా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలోనే అసదుద్దీన్ మళ్లీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులేవీ పని చేయలేదు. బుధవారం ఆమె కేసీఆర్తో భేటీ కానున్నట్లు తెలిసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడతారని సబిత వర్గీయులు తెలిపారు. రెండు రోజుల కిందట సబిత, ఆమె తనయుడు కార్తీక్రెడ్డి అసదుద్దీన్ ఇంట్లో టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమైన సంగతి తెలిసిందే. దాంతో, టీఆర్ఎస్లోకి వెళ్లకుండా ఆమెను నిలువరించేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలంతా రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్తోపాటు సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు సబితతో భేటీ అయి బుజ్జగించారు.