హైదరాబాద్: పరిపాలనలో దీక్షాదక్షతలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. మానవత్వంలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటి రారని స్పష్టం చేశారు. మింట్కాంపౌండ్లో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి జగదీష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ..ఉద్యోగుల డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల జీవితాలు చీకట్లలో ఉండరాదనేది సీఎం కేసీఆర్ ఆలోచన..విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు ఉండాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయమని జగదీష్ రెడ్డి తెలిపారు.