హైదరాబాద్: జాయింట్ కలెక్టర్లతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. యాసంగి మార్కెటింగ్ సీజన్, ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ..ఏప్రిల్ ఒకటి నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3732 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తాం. రైతులకు కొనుగోలు కేంద్రాల సమాచారం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేస్తామన్నారు.