హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది. సీఎం కేసీఆర్తో సమావేశం ముగిసిన అనంతరం కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. తాము అడగాల్సినవి అడిగాం.. సీఎం కేసీఆర్ చెప్పాల్సినవి చెప్పారు. చేవెళ్ల భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్లో చేరుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.