హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ నిర్వహిస్తున్న పలు రకాల పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఒక సంవత్సర కాల వ్యవధితో నిర్వహించే ప్రోగ్రామ్స్లో ఫొరెన్సిక్ సైన్స్, కెమికల్ అనాలసిస్, హ్యుమన్ రైట్స్, లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, సైబర్ లాస్, , కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఎనర్జీ మేనేజ్మెంట్ తదితర కోర్సులను నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం www.uohyd.ac. in వెబ్సైట్ 040-24600264/ 040-24600265, 8897 436905 నెంబర్ల ద్వారా సంప్రదించాల్సిందిగా అధికారులు వెల్లడించారు