ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ ఓకే చేస్తేనే వైసీపీలో టిక్కెట్లు : ఓ సీనియర్ నేత ఆవేదన..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 07:00 PM

జగన్మోహన్ రెడ్డి నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆ పార్టీ నేతలు చాటుమాటుగా సెటైర్లు వేస్తూంటారు. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్. ఆయనను కన్సల్టెంట్‌గా పెట్టుకున్నప్పటి నుంచి.. దాదాపుగా పార్టీ వ్యవహారాలన్నీ టేకోవర్ చేశారు. అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. లోటస్‌పాండ్ సమీపంలోనే ఉన్న ఓ భవనంలో.. ప్రశాంత్ కిషోర్ అండ్ టీం మకాం వేసింది. అక్కడ …కూడికలు, తీసివేతలు, సర్వేలతో..ఆ టీం కుస్తీ పడుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే ఇంతకు ముందు వరకూ… పీకే టీం స్వయంగా చేసుకున్న సర్వేలతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేసేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం.. తెలంగాణకు చెందిన ఓ సర్వే సంస్థ ఇస్తున్న రిపోర్టుల మీద ఆధార పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ సర్వే రిపోర్టులన్నింటినీ పక్కన పెట్టేశారు. తెలంగాణ ఎన్నికల్లో.. తమ సర్వేలు వంద శాతం ఖచ్చితం అయ్యాయని చెబుతూ… రిపోర్టులు తయారు చేస్తూ పీకే అండ్ టీంకు పంపుతున్నారు.వీటిని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులపై కసరత్తు చేయాలనే ఒత్తిడి ఉండటంతో.. పీకే టీం కూడా అదే చేస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. అదే … సర్వే నివేదికల ఆధారంగా… ఇతర పార్టీల నేతల్ని.. ఆహ్వానిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటికీ హైదరాబాద్ నుంచే రాజకీయం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్‌కి.. పలువురు నేతలు వచ్చి కండువా కప్పించుకుంటున్నారు. వీరిలో స్వచ్చందంగా వచ్చిన వారెంత మంది అన్నదానిపై.. వైసీపీ నేతలే… అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదృశ్య శక్తుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారంగాణనే.. ఎక్కువ మంది వైసీపీలో చేరుతున్నారనేది.. ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్న బహిరంగరహస్యం. వ్యాపారాలు, ఇతర సమీకరణాల్ని లెక్క గట్టుకుని..వైసీపీలో బలవంతంగా చేర్పిస్తున్నారని.. కొంత మంది అంటున్నారు.
ఇలా కొంత మంది నేతల్ని…పార్టీలో చేర్పించుకోవడానికి.. జగన్ కూడా.. సిద్ధంగా లేరు. కానీ చేర్పించకోక తప్పని పరిస్థితి. ఆ విషయం..జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించేటప్పుడే తెలిసిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే.. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండానే.. చేరికల వ్యవహారాల్ని ఇతరులు డీల్ చేయడం వల్లనేనని..వైసీపీ సీనియర్లు చెబుతున్నారు… మొత్తానికి.. తెలంగాణ భవన్‌లో ఓకే అయితేనే… వైసీపీ లిస్ట్ బయటకు రానుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com