తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో చివరకు తాత్సారం చేసి, ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ అనుభవం గుణపాఠంగా మారింది. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో జోరు పెంచింది. ఎన్నికలకు నెలరోజుల వ్యవధి కూడా లేకపోవడంతో కొన్నిస్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది. కొన్ని చోట్ల ఇద్దరిని ఎంపిక చేసుకుని, వారిలో ఒకరిని తప్పించేందుకు చర్చలు జరుపుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టాన నేతలతో కలసి జాబితా రూపకల్పనలో పాల్గొంటున్నారు. మొత్తం 17 సీట్లకు గాను 15 సీట్లకు పేర్లు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారం చివర్లోగాని, సోమవారంగాని అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.
మీడియాకు అందుతున్న వివరాలప్రకారం అభ్యర్థుల వివరాలు
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఆదిలాబాద్ – రమేశ్ రాథోడ్
మల్కాజ్ గిరి – రేవంత్ రెడ్డి
నిజమాబాద్ – మధు యాష్కీ
జహీరాబాద్ – షబ్బీర్ అలీ/మదన్ మోహన్ రావు
భువనగిరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కరీంనగర్ – జీవన్ రెడ్డి/ పొన్నం ప్రభాకర్
నల్గొండ – జానారెడ్డి
మహబూబ్ నగర్ – డీకే అరుణ
నాగర్ కర్నూల్ – దామోదర రాజనర్సింహ/ సతీశ్ మాదిగ
హైదరాబాద్ – ఫిరోజ్ ఖాన్
సికింద్రాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
మెదక్ – సునీతా లక్ష్మారెడ్డి
వరంగల్ – అద్దంకి దయాకర్
ఖమ్మం – నామా నాగేశ్వరావు(టీడీపీతో పొత్తుకింద)
పెద్దపల్లి – కవ్వంపల్లి సత్యానారాయణ