లోక్సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్ అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జే పాటిల్ ప్రజలకు సూచించారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ. ఆన్లైన్ లావాదేవీలపై కూడా తాము నిఘా వేస్తామని , ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బహిరంగస్థలాలు, గోడలపై రాతలు రాయవద్దని కోరారు. అభ్యర్థులు ఎవరైనా గోడలపై రాతలు రాసినా, హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేసినా వెంటనే తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ప్రశాంత్ ఆదేశించారు. బెల్ ఈవీఎంల స్థానంలో ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీయంలను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తామని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 50వేలరూపాయల కంటే అధికంగా నగదు తీసుకువెళ్లేందుకు వీలు లేదని, అలా చేస్తే నగదును సీజ్ చేస్తామని ఎన్నికల అధికారి హెచ్చరించారు.
> బ్యాంకులో రూ.లక్షకు మించి నగదు జమ చేస్తే డిపాజిట్కు సోర్స్ చూపించాల్సి ఉంటుందని, > బ్యాంకు ఖాతా నుండి రూ.లక్షకు మించి విత్ డ్రా చేస్తే అందుకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారాయన. అలాగే నగదుతో ప్రయాణించే వారు.. అందుకు సంబంధించిన ఆధారాలు(ఎలా వచ్చాయి, ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయాలు తెలిపే బిల్లులు) తీసుకెళ్లడం ఉత్తమని ఇక బంగారం వ్యాపారం వాళ్ళు అందుకు సంబంధించిన ప్రూఫ్స్(బిల్లులు) తీసుకువెళ్ళాల్సిందేనని స్పష్టం చేసారు.