అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి తండ్రి రాములు తెలిపిన ప్రకారం.. వనపర్తి జిల్లా మ దనాపురం మండలం గోపన్పేట్కు చెందిన కడ్మూరి ఆంజనేయులు(33)డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసం ఉండేవాడు. తొమ్మిదేళ్ల క్రితం మహబూబ్నగర్ మక్తల్ మండలం భాగవన్పల్లికి చెందిన సుహాసినితో ప్రేమ పెండ్లి చేసుకుని శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లితండాలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, ఆంజనేయులు మృతదేహాన్ని భార్య సుహాసిని గోపన్పేట్కు తీసుకెళ్లింది. తన భర్త అతిగా కల్లుతాగి మృతి చెందాడని తెలిపింది. మృతుడి గొంతుపై గాయాలు ఉండటంతో హత్యగా భావిస్తూ కుటుంబసభ్యులు మదనాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే ఆంజనేయులును భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మదనాపురం పోలీస్స్టేషన్లో కేసు నమోదైందని, కేసు ట్రాన్స్ఫర్ అయ్యాక స్థానికంగా దర్యాప్తు చేపడుతామని చందానగర్ ఎస్ఐ రమేశ్ తెలిపారు.