హైదరాబాద్ : కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బుల చెల్లింపులను రైతులకు 48 గంటలోపు ఓపీఎంఎస్ ద్వారా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లతో, జిల్లా పౌరసరఫరాల అధికారులు,జిల్లా పౌరసరఫరాల సంస్థ నిర్వహణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రబీ ధాన్యము కొనుగోలు కోసం చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరీశ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రమేశ్, జిల్లా పౌర సరఫరాల శాఖ సంస్థ నిర్వహణ అధికారిణులు శ్యామరాణి, వి.రాధిక, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.