ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండే ఎండల్లో ‘ముంజలు’ తింటే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 12:48 PM

ఆరు అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందంటే నమ్మగలరా.. వేసవి కాలంలో మాత్రమే దొరికే తాటి ముంజలను ఐస్ ఆపిల్స్ అంటారు. ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు. అద్భుత ఔషధ గుణాలు ఉన్న ఈ తాటి ముంజలను దొరికినన్నాళ్లు వీలైతే ప్రతి రోజూ తినడానికి ప్రయత్నించండి. కల్తీ లేని లేత తాటి ముంజలను ఇష్టపడని వారు ఉండరు. ఇందులో ఉండే ఏ,బీ,సీ విటమిన్లు ఐరన్, జింక్, పాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో అధికంగా పేరుకున్న కొలెస్ట్రాల్‌ని నివారిస్తుంది. 


ముంజల్లో ఉన్న కాల్షియం ఎముకల్లోని బలాన్ని, వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. గుండెసంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. తాటి ముంజలు తినడం వలను బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.లివర్ సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండ వేడిమికి శరీరంలోని గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారిస్తుంది. ముఖం మీద మొటిమలు ఉన్నవారు దొరికినన్ని రోజులు తాటి ముంజలు తింటే తగ్గుముఖం పడతాయి. వీటిలో ఉన్న పొటాషియం శరీరంలోని పేరుకున్న విషపదార్థాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మండే ఎండల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. ఆ సమయంలో ముంజలు తింటే శారీరక ఉపశమనం పొందవచ్చు. కేన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి. ట్యూమర్, బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివ‌ృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com