జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో అధికారులు చర్చించారు. అనంతరం తెలంగాణకు 28 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 17.5 టీఎంసీల నీటిని కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.