ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రికి గవర్నర్ నరసింహన్ దంపతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 11:38 AM

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. స్వామి వారికి గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. ఉగ్రరూపుని కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిన్న ఉదయం ఉగ్రరూపుడు జగన్మోహినిగా దర్శనం ఇచ్చారు. రాత్రి ముత్యాల పల్లకిలో అశ్వ వాహనసేవలో ఊరేగుతూ వచ్చి కల్యాణ మండపం వద్ద కల్యాణఘడియలు ఖరారు చేసుకుని ఎదుర్కోలు మహోత్సవాన్ని అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. కల్యాణ వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com