నిజామాబాద్ : సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉంది కనుక ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని లక్షలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.