తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వాలు అసుసరిస్తున్న తీరు అసలు బాలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లడుతూ విభజన చట్టంలో కేంద్రం తెలంగాణ పట్ల చేసిందేమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తెలంగాణా రాష్ట్రo దేశంలో అంతర్భాగం కాదా..? ఎందుకు రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ కు 90 శాతం నిధులను ఇస్తే కాళేశ్వరంకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అందుకే కేంద్రంలో ఇతర పార్టీలను కలుపుకొని పోయి తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలని కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ కవితను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అదేవిధంగా 19న జరిగే సీఎం సభకు అందరూ హాజరు కావాలని ఆయన సూచించారు.
-