నేడో రేపో రైళ్లను నడిపేందుకు అమీర్ పేట్ – హైటెక్ సిటీ మార్గంలో రైళ్లు నడిపేందుకు మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి. అయితే సిఎం దీనిని ఆరంభిస్తారని అంతా అనుకున్నా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంలో లాంఛనంగా సర్వీసులను ప్రారంభించనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్.రెడ్డి శుక్రవారం ప్రకటించారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సిఎంఆర్ఎస్) తాజాగా అనుమతి ఇచ్చింది. నాలుగు నెలలుగా ఈ కారిడార్ లో ప్రయోగాత్మకంగా రైళ్లు కూడా నడుపుతున్న విషయం విదితమే.
అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో రైళ్లు నడపడానికి మార్గం సుగమం కావడంతో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో హైదరాబాద్ లో మూడు కారిడార్లలో సేవలు అందుబాటులోకి రానున్నాయి.