17వ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచే అభ్యర్థులు ఎవరూ లేరని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిగి ఉంది. పార్టీ గెలుపు కోసం కష్టపడి చేస్తున్నారు. కానీ సత్తా ఉన్న నాయకులంతా పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకులు లేరని ఘోష్ తెలిపారు. ఇతర పార్టీల నేతలు అభివృద్ధి కోసం తమ పార్టీలో చేరుతున్నారని.. అట్లాంటి వారిని ఎలా నిలువరిస్తామని ఆయన అన్నారు. 42 లోక్సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో 23 స్థానాల్లో గెలవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నారు.