పటాన్చెరువు దగ్గర ఉన్న టోల్ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.డబ్బులు చెల్లించాలని అడిగినందుకు కోపం తెచ్చుకున్న వాహనదారుడు బూత్లోకి దూసుకొచ్చి.. టోల్ కలెక్టర్పై చెప్పుతో దాడి చేశాడు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు స్పష్టమవుతోంది. DL 1 N 5496 నంబర్ గల కారులో గచ్చిబౌలి నుంచి సంగారెడ్డి వెళ్తున్న కొందరు వ్యక్తులు.. పటాన్చెరు దగ్గర ఉన్న ఎగ్జిల్ టోల్ గేట్ నుంచి వెళ్లే సమయంలో ఫీజు చెల్లించమన్నందుకు అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. రెచ్చిపోయిన కారులోని వ్యక్తులు.. టోల్ బూత్లోకి చొచ్చుకెళ్లి చెప్పుతో టోల్ కలెక్టర్పై దాడి చేశారు. ఇతర సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా బూతులు తిడుతూ దాడి చేశారు. వాహనదారుడి దౌర్జన్యమంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.