ఎంపీ సీట్లను అమ్ముకునేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోందని ,కేంద్రంలోని మోదీ పాలనకు చమరగీతం పాడాలంటే ప్రతిఒక్కరూ కాంగ్రె్సకు అండగా నిలబడాలని కోరారు. మల్కాజిగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తదుపరి ఢిల్లీలో చక్రం తిప్పుతామంటున్నారన్న వారు ఢిల్లీలో బొంగ రం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, టీఆర్ఎ్సకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రలో క్షుద్ర రాజకీయం నడుస్తోందని, విపక్షమే లేకుండా సామ్రాజ్యాన్ని ఏలే రాజులైపోయినట్టు కేసీఆర్ కేటీఆర్లు కలలు కంటున్నారని అన్నారు. అందుకే అభివృద్ధి చేసామంటూ ఏం చేసామో చెప్పలేక విపక్షాలపైన పక్కరాష్ట్రంపైనా దండయాత్ర ఆరంభించారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన వారు స్థానిక సమస్యల పై మాట్లాడాల్సి ఉంటుందని, . ఇక్కడ కారుకు ఓటేస్తే.. ఆ ఓటు ఢిల్లీ వెళ్లేసరికి కమలంలా మారిపోతుందన్నది సుస్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేసారు.