హైదరాబాద్: ఐపీఎల్-12 సీజన్లో కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో సాధన చేస్తోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా భాగ్యనగరం రావడంతో జట్టు శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది. గడ్డంతో కొత్త అవతారంలో కనిపించిన వార్నర్ సహచర ఆటగాళ్లతో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఉప్పల్ మైదానంలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో వార్నర్ ధనాధన్ బ్యాటింగ్తో అర్ధశతకం పూర్తి చేశాడు. జట్టులోని ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి సన్నాహక మ్యాచ్ ఆడారు. కోచ్ టామ్ మూడీ, సహాయ సిబ్బంది పర్యవేక్షణలో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ సాధన చేయగా.. బౌలర్లు బంతులేసి తమ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఈనెల 24న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ తొలి మ్యాచ్ ఆడుతుంది. 29న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో పోటీపడుతుంది.