పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎర్ణ కథనం ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తి(50) గురువారం ఉందానగర్-తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు ఫోన్ : 8106801989, 040-27568355లలో సంప్రదించాలని కోరారు.