పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డ్, ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా సూర్యాపేటలో ఉత్తమ్ మాట్లాడుతూ… 10లక్షల మంది విద్యార్థులు మానసికంగా క్షోభకు గురయ్యారన్నారు. ఇంటర్ ఫలితాలే టీఆర్ఎస్ పాలనకు నిదర్శనమన్నారు. చనిపోయిన విద్యార్థులకు రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.