న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ లోనూ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిన ప్రాంతంలోని 59 లోక్ సభ స్థానాలకు ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. అయితే పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో పలు చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లోని పలు చోట్ల ఈవీఎంలు పని చేయడం లేదు.