ముంబై-చెన్నై దాదర్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఎక్స్ ప్రెస్ కు చెందిన ఎస్ -2 బోగీలో పొగలు వచ్చాయి. కడప రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఈ ఘటన జరగడంతో గమనించిన ప్రయాణికులు భయబ్రాంతులకు గురై రైలు నుండి కిందకు దిగారు. కాగా భోగీలోని వీల్ వద్ద సాంకేతిక లోపం వలన ఈ పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. అరగంట పాటు మరమత్తులు అనంతరం ఎక్స్ ప్రెస్ చెన్నై బయలుదేరి వెళ్ళింది. కడపకు చేరుకున్న అనంతరం ఈ పొగలు రావడం, ప్రయాణికులు సురక్షితం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.