జయశంకర్ భూపాలపల్లి: కన్నెపల్లి పంప్హౌస్ పనులను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మేడిగడ్డ చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ముందు జరగాల్సిన ప్రాజెక్టు పనులపై అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.