మెదక్ : చేగుంట మండలం వడియారం వద్ద కాచిగూడ - అకోలా ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఈ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే అధికారులు నిలిపివేశారు. అరగంటకు పైగా వడియారం వద్దే రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తోంది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.