ప్రధాని నరేంద్ర మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారణాశినుంచి మోడీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్కు సంబంధించి హైకోర్టు మోడీకి నోటీసు జారీ చేసింది. బిఎస్ఎఫ్ మాజీ జవాను, ఎస్పి అభ్యర్థి తేజ్బహదూర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఆగస్టు 21న విచారణ చేపట్టనున్నది.