ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 12:31 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 85 పాయింట్లు నష్టపోయి 37,897 వద్ద, నిఫ్టీ 1 పాయింటు నష్టపోయి 11,329 వద్ద ట్రేడవుతున్నాయి. వేదాంతా, మారుతీ, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలోని అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ లోహ, నిఫ్టీ ఆటో సూచీలు 1.3 శాతం నష్టపోయాయి. రూపాయి 15 నష్టంతో రూ.69.09 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మొత్తం 44 కంపెనీలు జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఏషియన్‌ పెయింట్స్‌, కెనరా బ్యాంక్‌, జుబ్లియంట్‌ ఫుడ్‌వర్క్‌ తదితరాలు ఉన్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com