ఆ కుటుంబం ఒంట్లో కరెంటు ఉంది, ఓ బల్బును వెలిగించే స్థాయిలో వీరి శరీరంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు నిపుణులు అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా, ఇలాంటి ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిరసన్న రామ్ నగర్ ప్రాంతానికి చెందిన చాంద్ బాషా ఇటీవల బల్బు కొని తీసుకొచ్చాడు. అయితే పిల్లలు ఈ బల్బును చేతితో పట్టుకోగానే వెలిగింది. సాధారణంగా బల్బులు వెలగాలంటే బ్యాటరీలు లేదా విద్యుత్ కావాలి. దీంతో చాంద్ బాషా దాన్ని చేతిలోకి తీసుకోగా వెలుగుతూనే ఉంది. చాంద్ బాషాతో పాటు అతని కుమారుడు, కుమార్తెలు తాకితే కూడా బల్బు వెలుగుతోంది. ఈ విషయం కాస్త ఆనోటా, ఈనోటా ఊరంతా పాకిపోయింది. దీంతో ఈ కుటుంబం ఊరిలో చిన్నస్థాయి సెలబ్రిటీ ఫ్యామిలీగా మారిపోయింది.