తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు. సీఎం చింతమడక గ్రామానికి ప్రకటించిన రూ.10 లక్షల పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల అరాచకాలు పెరిగిపోయాయని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు తలొగ్గి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.