తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, మజ్లిస్కు భయపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఆయన రాంనగర్లో ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విమోచన దినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17న బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా హాజరవుతారని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం శుభపరిణామన్నారు. తమ పార్టీ తదుపరి లక్ష్యం తెలంగాణనేనని పేర్కొన్నారు