రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మా లక్ష్యం మున్సిపల్ ఎన్నికలు కాదని, 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు.