Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న: అరుణ్జైట్లీ మరణం బీజేపీకి తీరని లోటే, ఐతే తెలుగు రాష్ట్రాలను విడదీసిన నేతలలో జైట్లీ ఒకరు, ఆదుకుంటానని చివరి వరకు ఆశ నింపి చేతులెత్తేసిన నేతగా తెలుగు వారు ఎప్పటికి గుర్తుంచుకొంటారనటంలో సందేహం లేదు. మీరేమంటారు.
- రాజ్కుమార్ చౌదరి, మంగళగిరి
జవాబు: మీరన్నది నిజమే కానీ, జైట్లీ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ చేశారని చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాల విడదీతలో అయన భాగస్వామ్యం ఉంది. ఆదుకునేందుకు అయన వెంకయ్యతో కలసి ప్రయత్నాలు చేసినా ఆర్ధిక సంఘ సూచనలే అడ్డు వచ్చాయి. హోదా కాదు సరి కదా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కూడా హుళక్కి కావడానికి అసలు మన నేతలు సవ్యంగా ఉండక పోవటమే అని నేననుకుంటాను. ఇప్పటికీ ఇదే తరహా డ్రామాలు ఆడుతూనే ఉన్నారు మన నేతలు అనటం లో సందేహించను.